రచన : వేదుల బాలకృష్ణమూర్తి (వ్రాయసకాడు - మల్లిన నరసింహారావు )
శ్రీకాకుళం,
తే 16-07-2009 ది.
తెలుగు పద్యానికి నా నైవేద్యం
కం||
పుల్లెల శ్యామసుందర్గారిచ్చిన న్యస్థాక్షరికి -- వేదుల బాలకృష్ణగారు పూరించిన పద్యం
1వ పాదములో 3 వ అక్షరము 'జ"
2వ పాదములో 5వ అక్ష్రము 'వా
3వ పాదములో 7వ అక్ష్రము 'హా
4వ పాదములో 9వ అక్ష్రము 'రూ
వచ్చునట్లుగా ఉత్పలమాలలో నెహ్రూ శాంతిప్రియత్వమును వర్ణిచాలి
పూరణ ఇలా సాగింది
ఉ||
మేటిజవహరుండు జగమెల్లను శాంతిగూర్పనెంచిదే
శాటనచే వరిష్ఠులను సంఘటితంబొనరించి వర్గపో
రాటములేని స్నేహయుత రాజరికాలవ్యవస్థనిల్పె ఈ
కూటమి నిత్యమై తనరుకోరిక తీరును శాంతిదూతకున్
సంక్రాంతి హేల
Design in CSS by TemplateWorld and sponsored by SmashingMagazine
Blogger Template created by Deluxe Templates